మద్నూర్: ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం
కామారెడ్డి జిల్లా మద్నూర్లో బుధవారం ఎక్స్జైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ ఊషతో కలిసి అధికారులు మొక్కలు నాటారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో వన మహోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి ముకుంద్ రెడ్డి, ఏ.ఈ.ఎస్ అరుణ్ చంద్ర తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఆబ్కారీ సీఐ పవన్ గౌడ్, […]
కామారెడ్డి జిల్లా మద్నూర్లో బుధవారం ఎక్స్జైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ ఊషతో కలిసి అధికారులు మొక్కలు నాటారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో వన మహోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి ముకుంద్ రెడ్డి, ఏ.ఈ.ఎస్ అరుణ్ చంద్ర తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఆబ్కారీ సీఐ పవన్ గౌడ్, డిటీఫ్ సిఐ సుందర్ సింగ్, ఎస్.ఐ నగేష్ తదితరులు పాల్గొన్నారు.





